News March 4, 2025
మీకు 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకోండి

ఏదైనా రోగం ముదిరాక ఆస్పత్రికి వెళ్లడం కంటే ముందే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 1-2 ఏళ్లకోసారైనా BP, CBC, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ECG, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, BMI చెక్, థైరాయిడ్, యూరిన్ టెస్ట్, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగానే చేస్తారు.
Similar News
News January 28, 2026
GNT: ‘చంద్రబాబు రాక..వైసీపీ నిరసన వాయిదా!

అంజుమన్ ఆస్థుల అన్యాక్రంతంపై వైసీపీ ఈ నెల 30న నిర్వహించనున్న నిరసన ర్యాలీ వాయిదా వేసినట్లు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తెలిపారు. 30న CMచంద్రబాబు GGHలో నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో నగరంపాలెం ఈద్గా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న ర్యాలీని ఫిబ్రవరి 6వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు.
News January 28, 2026
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దీటైన జవాబు

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ వైపు మరో యుద్ధనౌక దూసుకొస్తోందని బెదిరిస్తూనే, వారు న్యూక్లియర్ డీల్ చేసుకుంటారని భావిస్తున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ఇరాన్ బదులిచ్చింది. తమపై యూఎస్ దాడులు చేస్తే మునుపెన్నడూ లేనంతగా దీటైన జవాబిస్తామని స్పష్టం చేసింది. అమెరికా తమతో చర్చలకు వస్తే అంగీకరిస్తామని, మిలిటరీ చర్యలకు దిగాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది.
News January 28, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్కు కాల్ చేయండి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.


