News March 4, 2025
అకౌంట్లోకి రూ.15,000.. కీలక ప్రకటన

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.
Similar News
News March 4, 2026
UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్లో 8 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(అకౌంట్స్, పర్చేజ్ &స్టోర్స్, ఫిజిక్స్), డిప్లొమా, ITI, ఇంటర్, టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 13వరకు పంపాలి. వెబ్సైట్: https://csr.res.in/
News March 4, 2026
కల్తీ నెయ్యి నివేదికను సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు: పయ్యావుల

AP: తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ మండలిని కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. CFTRI నివేదిక నెయ్యి కల్తీపై స్పష్టత ఇచ్చినా, దాన్ని YV సుబ్బారెడ్డి తొక్కిపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. YCP హయాంలో TTD నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని ధ్వజమెత్తారు. జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలున్నాయంటూ NDDB రిపోర్ట్ కూడా చెప్పిందని TDP MLC అనురాధ విమర్శించారు.
News March 4, 2026
83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $82.66కు చేరింది. అయితే ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తామని, అవసరమైతే హార్ముజ్ జలసంధిలో నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ హామీ ఇవ్వడంతో ధరల పెరుగుదల వేగం తగ్గింది. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 12% పెరిగింది. ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్కు ఇది ఆర్థికంగా భారం కానుంది.


