News March 4, 2025

ఏపీకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా?

image

AP విభజన జరిగి పదేళ్లయినా పూర్తిస్థాయి <<15642015>>రాజధాని <<>>లేదు. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించగా, 2019లో గెలిచిన YCP 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. 2024లో వచ్చిన కూటమి GOVT అమరావతే రాజధాని అని చెప్పింది. దీంతో రేపు మరో పార్టీ గెలిస్తే రాజధానిని మళ్లీ మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడైనా అన్ని పార్టీలు కలిసి APకి ఒక రాజధాని చాలా? మరిన్ని కావాలా? అనేది నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 4, 2025

యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

image

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.

News March 4, 2025

దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాసిన విద్యార్థి

image

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

News March 4, 2025

ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

image

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!