News March 4, 2025
KCRపై అనర్హత వేయాలని పిల్.. విచారణ వాయిదా

TG: KCR అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.
Similar News
News March 4, 2025
రోహిత్, గిల్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీ: టీమ్ ఇండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(28), గిల్ (8) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43/2గా ఉంది. విరాట్ (5*), శ్రేయస్ అయ్యర్ (0*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 42 ఓవర్లలో 222 రన్స్ కావాలి.
News March 4, 2025
వింత సమస్యతో బాధపడుతున్న హీరోయిన్!

మంచి గుర్తింపు తెచ్చుకున్న పాతతరం హీరోయిన్లలో లైలా ఒకరు. ఇటీవల తనకున్న వింత సమస్య గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ భామ. తాను నవ్వకుండా ఉండలేనని, నవ్వు ఆపేస్తే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయన్నారు. శివపుత్రుడు షూటింగ్ సందర్భంగా విక్రమ్ ఓ నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని ఛాలెంజ్ విసరగా, 30సెకన్లకే ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మేకప్ అంతా పాడైపోయిందని వివరించారు.
News March 4, 2025
యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.