News March 4, 2025
మెదక్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. 24 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి

కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్లో బీజేపీ అంజిరెడ్డి 24 ఓట్ల లీడ్లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News April 18, 2026
మక్తల్లో ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2,059 మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల పర్యవేక్షణ అధికారి నాగశివ కోరారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకరు సీఐ, ముగ్గురు ఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News April 18, 2026
HYD: 18 మంది ఉన్న బస్సు దగ్ధం

KPHB మెట్రో పిల్లర్ నం. A-834 వద్ద శుక్రవారం <<19678807>>రాత్రి<<>> ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(శ్రీ దుర్గా మల్లేశ్వరి ట్రావెల్స్)లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లుకు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
News April 18, 2026
ఎర్రగుంట్ల: అంత్యక్రియలను అడ్డుకున్నారు.. కారణం ఏంటంటే.!

ఎర్రగుంట్ల(M) పొట్లదుర్తిలో అంత్యక్రియలను కొందరు అడ్డుకున్నారు. నరసింహులు అనే వ్యక్తి మృతి చెందడంతో బంధువులు అంత్యక్రియలు చేపట్టేందుకు శ్మశానవాటికు వెళ్లారు. ఆలయ నిర్వాహకులు ఈ స్థలం దేవాలయందని ఇక్కడ శవాన్ని పూడ్చడానికి వీలులేదని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ, ఎమ్మార్వో ఘటనా స్థలానికి చేరుకొని రికార్డులను పరిశీలించి స్థలం దేవాలయందని తేల్చారు. దీంతో అంత్యక్రియలు మరో ప్రాంతంలో నిర్వహించారు.


