News March 4, 2025
KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 4, 2025
నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
News March 4, 2025
బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

బనకచర్ల ప్రాజెక్టుకు TG ప్రభుత్వం అడ్డు <<15640378>>చెప్పడంపై<<>> AP CM చంద్రబాబు స్పందించారు. ‘గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోంది. నాకు 2 ప్రాంతాలు సమానం.. రెండు కళ్లు అని చెప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు.
News March 4, 2025
సర్వేలు త్వరగా పూర్తి చేయండి: జేసీ

అల్లూరి జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల సర్వేలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్లో ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు లేని పిల్లలు, జనన మరణాల ఆలస్య నమోదు, స్కూల్ టాయిలెట్ తనిఖీ, వర్క్ ఫ్రమ్ హోం, పీ4, తదితర సర్వేలు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.