News March 4, 2025
సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Similar News
News January 14, 2026
ప్యాసింజర్ వెహికల్స్కు పెరుగుతున్న డిమాండ్

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.
News January 14, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 14, 2026
జితేశ్ శర్మ ఆల్టైమ్ IPL టీమ్.. విరాట్ కోహ్లీకి నో ప్లేస్

RCB వికెట్కీపర్ జితేశ్ శర్మ తన ఆల్టైమ్ IPL టీమ్ను ప్రకటించారు. అయితే ఇందులో కోహ్లీకి చోటు ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. 2025 సీజన్లో ఆర్సీబీ టైటిల్ విజయంలో కోహ్లీ (657 పరుగులు) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. జితేశ్ తన జట్టుకు ధోనీని కెప్టెన్గా ఎంపిక చేశారు. అదే విధంగా రోహిత్, గిల్క్రిస్ట్, సూర్యకుమార్, కల్లిస్, ABD, బుమ్రా, హేజిల్వుడ్, హార్దిక్, అక్షర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.


