News March 4, 2025

సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయండి: కలెక్టర్

image

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్చి 31లోపు రుణాలు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 17, 2026

రెవెన్యూ క్లినిక్‌లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.

News March 17, 2026

ప్రభుత్వ ఆదాయం పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ, ఇతర ఆదాయార్జన శాఖల అధికారులు పాల్గొన్న ఈ సభలో.. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

News March 17, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్.. 24 అర్జీల స్వీకరణ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 24 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్‌ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.