News March 4, 2025
అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249 మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 20, 2026
శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.
News March 20, 2026
శాంతియుత వాతావరణంలో రంజాన్ చేసుకోవాలి: KMR SP

కామారెడ్డి SP రాజేశ్ చంద్ర శుక్రవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రంజాన్ పండుగ వేళ భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణ, CC కెమెరాల పర్యవేక్షణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పండుగ వేళ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదన్నారు.
News March 20, 2026
మహబూబాబాద్: ఓపెన్ డ్రింకింగ్పై జిల్లా వ్యాప్తంగా దాడులు

జిల్లాలో గంజాయి వినియోగం, బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు ఎస్పీ డా.శబరీష్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పది రోజుల్లో 130 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి, బహిరంగంగా మద్యం తాగుతూ పట్టుబడిన 37 మందిపై కేసులు నమోదు చేశారు. యువత పెడదోవ పట్టకుండా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.


