News March 4, 2025

భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

image

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.

Similar News

News March 15, 2026

మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు: వైసీపీ

image

AP: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన <<19386182>>డ్రగ్స్ పార్టీలో<<>> టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారని వైసీపీ ట్వీట్ చేసింది. టీడీపీ డ్రగ్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోందని మండిపడింది. ‘మీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి’ అంటూ అనిత, చంద్రబాబు, పవన్, లోకేశ్‌ను ట్యాగ్ చేసింది.

News March 15, 2026

పటాన్‌చెరు: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

image

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. జహీరాబాద్‌కు చెందిన మహేందర్ రుద్రారం గీతం యూనివర్సిటీ సమీపంలో కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నాడు. 12న భార్య కనకమ్మతో గొడవ జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కనకమ్మతో పాటు పిల్లలు సందీప్(8), హరీశ్(6), ఆకాశ్(4) కనిపించలేదు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2026

భూపాలపల్లి: రాయితీపై రైతులకు జిప్సం పంపిణీ

image

భూపాలపల్లి: జిల్లాలోని రైతులకు సబ్సిడీపై జిప్సం పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. జిప్సం వాడకం వల్ల సౌడు భూముల స్వభావం మారి, నేలలో కాల్షియం, సల్ఫర్ పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి ఒక టన్నుకు కేవలం రూ. 566 చెల్లిస్తే, 90 శాతం రాయితీతో సరఫరా చేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.