News March 4, 2025
వికారాబాద్: పరీక్షలకు సర్వం సిద్ధం: శంకర్ నాయక్

జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు నోడల్ అధికారితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8:45లోగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు చేరుకోవాలని 9:05 నిమిషాల వరకు అనుమతి ఇస్తారన్నారు.
Similar News
News September 17, 2025
హుస్నాబాద్: ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలి: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మానవీయ కోణంలో ఆలోచించి సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల ఛార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిందని గుర్తు చేశారు.
News September 17, 2025
1-12 తరగతుల వరకు మార్పులు: CM

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్లోనే జావెలిన్ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్లో జరిగిన ఛాంపియన్షిప్లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.