News March 4, 2025

మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

image

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.

Similar News

News March 11, 2026

BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

image

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.

News March 11, 2026

BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

image

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.

News March 11, 2026

అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

image

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..