News March 4, 2025
తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News April 17, 2026
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు (పాలిసెట్) పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News April 17, 2026
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ గన్లతో గాలింపు చేపడుతోంది. పులికి హాని కలగకుండా త్వరలోనే బంధిస్తామని, అప్పటివరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారి ఎస్.కె. వలీ సూచించారు.
News April 17, 2026
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ గన్లతో గాలింపు చేపడుతోంది. పులికి హాని కలగకుండా త్వరలోనే బంధిస్తామని, అప్పటివరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారి ఎస్.కె. వలీ సూచించారు.


