News March 4, 2025

తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Similar News

News January 21, 2026

ఏడేడు జన్మల బంధం సాధ్యమేనా?

image

భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెబుతున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవచింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు, ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం.

News January 21, 2026

నంద్యాల చిన్నారి ప్రపంచ ఘనత

image

నంద్యాల జిల్లా నెరవాటి స్కూల్‌కు చెందిన మూడో తరగతి విద్యార్థిని కె.నాగసారిక వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె నాగసారికను సత్కరించారు. 28 సెకన్లలో 100 హిందీ పదాలను వేగంగా ఉచ్చరించి ఈ రికార్డు నెలకొల్పినట్లు వివరించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని, పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆమె అభినందించారు.

News January 21, 2026

సిద్దిపేట ఈనెల 22న డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనవరి 22న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ. సునీత తెలిపారు. ఇంటర్,డిగ్రీ అర్హత తో ఈ జాబ్స్ ఉంటాయన్నారు. జాబ్ మేళాలో మొత్తం 7 కంపెనీలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.