News March 4, 2025
పాలకుర్తి: చాకలి ఐలమ్మ వారసుడిని కలిసిన పృథ్వీరాజ్

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 19, 2025
NMMS స్కాలర్షిప్ గడువు పొడిగింపు: డీఈవో

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.
News September 19, 2025
ఐటీఐ కోర్సులో మిగులు సీట్లు భర్తీ దరఖాస్తుల ఆహ్వానం

మన్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగులు సీట్లు కొరకు 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాస ఆచారి గురువారం తెలిపారు. ఈ నెల 27 తేదీ వరకు వెబ్ పోర్టల్ http://iti.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తరువాత ప్రింట్ తీసుకొని ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు.
News September 19, 2025
మెదక్: 22 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు

మెదక్ పట్టణంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.రాధాకిషన్ తెలిపారు. బాలికల పాఠశాలలో పదో తరగతి, బాలుర పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. పదో తరగతికి 194 మంది, ఇంటర్కు 524 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వివరించారు.