News March 4, 2025
ఆన్లైన్ సేవలు అందించండి: కలెక్టర్

కలెక్టర్ లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలన్నారు. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ-పీఏసీలుగా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్లైన్ సేవలు అందించాలని ఆదేశించారు.
Similar News
News April 1, 2026
JGL: వీడిన రాజకీయ సందిగ్ధం.. ఎట్టకేలకు AMC ఛైర్మన్ల నియామకం

మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత జగిత్యాలలో రాజకీయ సందిగ్ధతకు తెరదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాజకీయ ఆధిపత్యంతో ఇన్ని రోజులుగా జగిత్యాల, రాయికల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం పెండింగ్లో ఉంది. ఈ మేరకు తాజాగా జగిత్యాల AMC ఛైర్మెన్గా గడ్డం నారాయణ రెడ్డి, రాయికల్ AMC ఛైర్మెన్గా పడిగేల రవీందర్ రెడ్డిలను నియమిస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News April 1, 2026
ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి!

ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చేవారికి భారీగా బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా ₹10 లక్షలు, సెకండ్ రూ.7లక్షలు, మూడో స్థానంలో నిలిచినవారు రూ.5లక్షలు గెలుచుకోవచ్చు. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
News April 1, 2026
చీమకుర్తి: గాంధీ నగర్ 4వ లైనులో హత్య

చీమకుర్తి గాంధీనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న రామ యోగి అను వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన రామయోగికి ఒక కుమారుడు. రామయోగి పెయింటింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటాడు. రామయోగి హత్య గురై మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


