News March 22, 2024

30న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

కడప జిల్లాలో ఈ నెల 31 తేదీన చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించినట్లు టీడీపీ అధిష్ఠానం వెల్లడించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీన మైదుకూరులో ప్రజాగళం సమావేశంతో పాటు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు తెలిపారు.

Similar News

News November 4, 2025

రేపు కడపకు రానున్న AR రెహమాన్

image

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.

News November 4, 2025

కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

image

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

News November 4, 2025

ఒంటిమిట్టలో త్వరలో నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో త్వరలోనే నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రారంభించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన నిత్య అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రదేశాన్ని పరిశీలించారు. తాత్కాలిక ప్రమాద రహిత జర్మన్ షెడ్లతో నిత్య అన్న ప్రసాద కేంద్రం ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.