News March 4, 2025

మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

image

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్‌లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News March 13, 2026

HYD అభివృద్ధి@2050.. కీలక ప్రతిపాదనలు

image

HYD మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక వర్క్‌షాప్‌‌లో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు. 2050 వరకు మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదించారు. మెట్రో నెట్‌వర్క్ పెంపు, రోడ్లు, హైవేలు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ కారిడార్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు/స్కైవాక్‌లు, 34 ROBలు, 16 RUBలు, 8 ఎలివేటెడ్ రోడ్లు, మూసీ నదిపై 29 వంతెనల కోసం ప్రతిపాదించారు.

News March 13, 2026

HYD అభివృద్ధి@2050.. కీలక ప్రతిపాదనలు

image

HYD మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక వర్క్‌షాప్‌‌లో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు. 2050 వరకు మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదించారు. మెట్రో నెట్‌వర్క్ పెంపు, రోడ్లు, హైవేలు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ కారిడార్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు/స్కైవాక్‌లు, 34 ROBలు, 16 RUBలు, 8 ఎలివేటెడ్ రోడ్లు, మూసీ నదిపై 29 వంతెనల కోసం ప్రతిపాదించారు.

News March 13, 2026

CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్‌సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.