News March 4, 2025
భూపాలపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షా హాళ్ల పరిస్థితులు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, మార్గదర్శకాల అమలును పరిశీలించారు. జిల్లాలో 3,615 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
కృష్ణా: ఫోన్కి మెసేజ్.. బాధితుల్లో కలవరం..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో MLAలు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఆన్లైన్ చేయాలంటే ఫోన్కి OTPలు వస్తాయి. ప్రస్తుతం ఈ OTPలు బాధితులను కలవరపెడుతున్నాయి. APGOV పేరుతో వచ్చే OTPలను చెప్పాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, వీటి మాటున సైబర్ నేరగాళ్లు చొరబడే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ విధానాన్ని వెంటనే తొలగించాలని కోరుతున్నారు.
News January 5, 2026
విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం: పార్థసారథి

AP: రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80గిగావాట్ల విద్యుత్ను తక్కువ ధరకు కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు కంప్లీట్ సబ్సిడీ.. బీసీలకు అదనంగా రూ.50వేల రాయితీ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.
News January 5, 2026
గజ్వేల్ అన్నదమ్ములు WORLD RECORD

గజ్వేల్కు చెందిన రామకృష్ణ, రఘురాం (అన్నదమ్ములు) హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభ చూపి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 30 నిమిషాలలో 600 కిక్ ఛాలెంజ్లో పాల్గొని రికార్డు బద్దలు కొట్టి బంగారు పతకం అందుకున్నారు. తల్లిదండ్రులు రామకోటి రామరాజు-పుష్ప మాట్లాడుతూ.. తనయులు లిమ్కా బుక్లో చోటు దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తపరిచారు.


