News March 22, 2024

కొత్త ‘లిక్కర్ పాలసీ’ని ఎందుకు తెచ్చింది?

image

మద్యం వ్యాపారంలో మాఫియా నియంత్రణ, ప్రభుత్వ ఆదాయం పెంపు, వినియోగదారుల సమస్యల పరిష్కారం వంటి ఆలోచనలతో ఢిల్లీలోని AAP ప్రభుత్వం లిక్కర్ పాలసీని తెచ్చింది. ఈ ప్రకారం మద్యం విక్రయాలు ప్రైవేటు పరం అయ్యాయి. MRP కంటే తక్కువకే మద్యం అమ్మేలా ప్రోత్సహించడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి 27%ఆదాయం పెరిగిందని ప్రకటించింది. BJP ఆరోపణలతో ED రంగప్రవేశం చేయగా పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

Similar News

News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

News October 2, 2024

పేపర్ కొనుగోలుకు వాలంటీర్లకిచ్చే నగదు నిలిపివేత

image

AP: న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు చెల్లిస్తున్న రూ.200 నగదును ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల పేపర్‌ కొనుగోలుకు నగదు సాయం నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దినపత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది. సాక్షి పేపర్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని TDP ఆరోపించింది.

News October 2, 2024

దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం!

image

TG: వరంగల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు యువకులు గత నెల 15న తనను ఓయో రూమ్‌కు తీసుకెళ్లి, బీరు తాగించి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తాను చదివే కాలేజీలోనే బీటెక్ చదువుతున్నారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.