News March 4, 2025

ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

image

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 5, 2025

ప్రభుత్వ హాస్టళ్లలో బీపీటీ రైస్‌తో భోజనం: మంత్రి స్వామి

image

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్‌తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.

News March 5, 2025

SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

image

TG: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

News March 5, 2025

రామారెడ్డి ఆలయంలో హీరో శ్రీకాంత్ సందడి

image

రామారెడ్డి మండలం ఈస్సన్నపల్లి గ్రామంలో గల కాలభైరవ స్వామి ఆలయంలో సినీ నటుడు శ్రీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. మంగళవారం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వారు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారి వారికి తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఆయనను చూడటానికి అక్కడి ప్రజలు గుమిగూడారు.

error: Content is protected !!