News March 4, 2025
ఆస్పత్రుల జబ్బుకు చికిత్స ఏది..?

అనారోగ్యం పాలైతే బాగు చేసే ఆస్పత్రులకే జబ్బు చేస్తే? ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు జబ్బుతో తమ వద్దే మెడిసిన్ కొనాలని, అక్కడ దొరికే మెడిసిన్ మాత్రమే రాసి పేషంట్ల నుంచి డబ్బు దండుకోవడం సాధారణమైంది. ఈ డబ్బు జబ్బు నిజమేనన్న సుప్రీంకోర్టు, పరిష్కారం ఏమిటని, దీనిపై పిల్ వేసిన లాయర్ను అడిగింది. అయినా.. ప్రభుత్వాస్పత్రులే సరిగా ఉంటే మనకు ఈ దోపిడీ ఉండేదా? ప్రజా వైద్యం ప్రజలకు అందితేనే ప్రైవేటు దందా తగ్గేది.
Similar News
News March 5, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం: మంత్రి స్వామి

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
News March 5, 2025
SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

TG: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
News March 5, 2025
రాష్ట్రంలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.