News March 22, 2024

కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ పరిశీలన

image

AP: విశాఖలో నిన్న పట్టుబడిన కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ న్యాయమూర్తి సమక్షంలో నేషనల్ ఫోరెన్సిక్ టీం డ్రగ్ టెస్ట్ చేస్తోంది. ఇందుకోసం 140 శాంపిల్స్ తీయాలని నిర్ణయించారు. కాగా, బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లోని 25వేల కేజీల మాదకద్రవ్యాలను నిన్న సీబీఐ పట్టుకుంది.

Similar News

News October 2, 2024

హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం

image

TG: హైడ్రాకు విశేష అధికారాలు కల్పించేలా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. GHMC చట్టం 1955లో 374B సెక్షన్ చేరుస్తూ GOVT ఆర్డినెన్స్ జారీ చేసింది. ORR పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ హైడ్రాకు సర్వాధికారాలు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

News October 2, 2024

మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

image

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.