News March 5, 2025

విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: హనుమకొండ DMHO

image

హనుమకొండ జిల్లాలోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్‌ను DMHO అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను.. సద్వినియోగ చేసుకొని రోగులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విధులలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

image

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?

News April 18, 2026

సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

image

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?

News April 18, 2026

విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్ల పాక్షిక రద్దు

image

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్‌నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.