News March 5, 2025
NZB: మార్కెట్కు భారీగా పసుపు.. ధర ఎంతంటే?

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు భారీగా పసుపు తీసుకుని వస్తున్నారు. శివరాత్రి తరువాత మార్కెట్ కు వరుస సెలవులు రావడంతో నిన్నటి నుంచి భారీగా పసుపు వస్తోంది. దీనితో మార్కెట్ పసుపు మయంగా మారింది. కాగా నిన్న హై గ్రేడ్ పసుపు కొనుగోలు ధర రూ.13,311 పలుకగా మీడియం రూ.11,30, లో గ్రేడ్ రూ.10 వేలు పలికింది.
Similar News
News January 9, 2026
టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News January 9, 2026
NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
News January 8, 2026
నిజామాబాద్: PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా NZBకు చెందిన జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్లో 3 రోజుల పాటు నిర్వహించిన PDSU 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యా రంగ సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతనని పేర్కొన్నారు.


