News March 22, 2024
NZB: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లిలో జరిగింది. స్థానిక ఎస్సై రాజు వివరాలిలా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్.. చిన్నారులు, విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. షీ టీం ఆధ్వర్యంలో గుడ్ టచ్- బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించగా.. విషయం బయటకొచ్చిందన్నారు. కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
Similar News
News April 16, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్కు సంప్రదించాలన్నారు.
News April 16, 2025
NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
News April 16, 2025
NZB: శని పుత్రుడు పోచారం: జీవన్ రెడ్డి

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన BRS రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డిని CM కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని ఎద్దేవా చేశారు.