News March 5, 2025

ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్

image

బాసర ఆర్జీయూకేటీలో ఈసీఈ శాఖలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్ పద్మశ్రీకి డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యాపకురాలు డాక్టర్.పద్మశ్రీని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలామందికి డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని గోవర్ధన్ పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

image

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR నుంచి సూపర్ లగ్జరీబస్సును ఏర్పాటుచేసినట్లు DM తెలిపారు. ఈనెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం 10న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11న సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4700, పిల్లలకు రూ.3540 చార్జీగా నిర్ణయించారు.

News July 6, 2025

మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

image

ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News July 6, 2025

వనపర్తి: జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలి

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని దినం 8 గంటల నుంచి పది గంటలకు పెంచుతూ దొడ్డిదారిన జీవో నంబర్ 282 ను తెచ్చిందని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి ఎనిమిది గంటల పరిధిలో సాధించుకున్నారన్నారు. శ్రమదోపిడి చేసే అందుకే 10 గంటలకు పెంచారని, జీవో రద్దు చేయాలన్నారు.