News March 5, 2025

ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్

image

బాసర ఆర్జీయూకేటీలో ఈసీఈ శాఖలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్ పద్మశ్రీకి డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యాపకురాలు డాక్టర్.పద్మశ్రీని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలామందికి డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని గోవర్ధన్ పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం ఇతనిదే..!

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి మరణం దొడ్డి కొమురయ్యదే అని చెప్పాలి. 1946 జూలై 4న దేశ్ ముఖ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలబడ్డాడు. శాంతియుతంగా ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తుండగా రజాకార్లు, పోలీసులు ఒక్కసారిగా ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొడ్డి కొమురయ్య వీర మరణం పొందాడు. అప్పటి నుంచి పోరాటం ఉద్ధృతం దాల్చింది.

News September 17, 2025

1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

image

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిల్లా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.

News September 17, 2025

HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

image

1948 SEP 10న నిజాం UNOలో భారత్‌పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.