News March 5, 2025

HYD: బీజేపీ నిర్ణయం దుర్మార్గం: కేటీఆర్

image

ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంకావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదని, ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూస్తుండటం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News November 14, 2025

పల్నాడు జిల్లాలో పులి, మొసలి కలకలం

image

పల్నాడు జిల్లాలో పులి, మొసలి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం వెల్దుర్తి మండలం వజ్రాల తండా వద్ద రెండు గేదెల మీద పులి దాడి చేసింది. మాచర్ల రామ టాకీస్ వద్ద చంద్రవంక వాగులో మొసలి సంచరించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ వాగులో మహిళలు బట్టలు ఉతుకుతూ ఉంటారు. పులిజాడను కనిపెట్టేందుకు ఆటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొసలిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

News November 14, 2025

జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న ఖమ్మం జిల్లా ప్రజలు

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఉమ్మడి ఖమ్మం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా?ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.