News March 5, 2025

ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు క్లోస్ : ASF సీఐ

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆసిఫాబాద్ సీఐ రవీందర్ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి మార్చి 25 వరకు ఉదయం నుంచి 12:30ల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు అసిఫాబాద్ సీఐ అల్ ది బెస్ట్ చెప్పారు.

Similar News

News March 8, 2026

శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

image

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

News March 8, 2026

ఏలూరు: కిడ్నాప్ కలకలం.. రక్షించిన పోలీసులు

image

చింతలపూడి మండలం వెలగలపల్లిలో శనివారం మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రీ నాగసత్య వరలక్ష్మిని వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే వరలక్ష్మి ఆచూకీని కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 8, 2026

NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

image

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.