News March 5, 2025
SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ

TG: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Similar News
News March 6, 2025
ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?
News March 6, 2025
పోరాట సింహం.. ‘మిల్లర్’ కిల్లర్

కివీస్తో CT సెమీస్లో SA ఓడినా మిల్లర్ చేసిన పోరాటం సగటు క్రికెట్ అభిమాని మనసును గెలిచింది. లక్ష్యం అందనంత దూరంలో ఉన్నా జట్టును గెలిపించాలనే కసితో చేసిన ప్రయత్నం అసామాన్యం. మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఫోర్లు, సిక్సులతో కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగారు. ఈ క్రమంలో చివరి 25 బంతుల్లో 54 రన్స్ చేశారు. మరో 3ఓవర్లు ఉంటే మిల్లర్ మ్యాచ్ను గెలిపించేవారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News March 6, 2025
ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలిచింది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు సైతం తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.