News March 5, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం: మంత్రి స్వామి

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
Similar News
News April 3, 2026
విద్యార్థులకు అలర్ట్.. 8 నుంచే పరీక్షలు

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ (SA2) పరీక్షల షెడ్యూల్ మారింది. APR 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని భావించినా ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 1-7తరగతుల వారికి 9Am-11.30Am వరకు, 8వ తరగతికి 9Am-11.45Am, నైన్త్ విద్యార్థులకు 9Am-12Pm వరకు పరీక్షలు జరుగుతాయి. APR 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.
News April 3, 2026
IPL: అభిషేక్ శర్మకు ఫైన్

అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన SRH బ్యాటర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు IPL ఓ ప్రకటనలో తెలిపింది. KKRతో నిన్న జరిగిన మ్యాచులో <<19551503>>అభిషేక్ క్యాచును<<>> వరుణ్ చక్రవర్తి అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టడానికి ముందు బాల్ నేలను తాకినట్లుగా కనిపించడం వివాదాస్పదమైంది.
News April 3, 2026
వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న మెడిసిన్ రేట్లు

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరిగే జాబితాలో మందులు కూడా చేరుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.


