News March 22, 2024

పురందీశ్వరిపై అసత్య ఆరోపణలు: యామినీ శర్మ

image

AP: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని బీజేపీ నాయకురాలు యామినీ శర్మ ఆరోపించారు. పోలీసులు, నార్కోటిక్స్ విభాగం నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని.. ఆ సంస్థ యజమానికి వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిపై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు.

Similar News

News October 2, 2024

మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

image

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

News October 2, 2024

పేపర్ కొనుగోలుకు వాలంటీర్లకిచ్చే నగదు నిలిపివేత

image

AP: న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు చెల్లిస్తున్న రూ.200 నగదును ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల పేపర్‌ కొనుగోలుకు నగదు సాయం నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దినపత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది. సాక్షి పేపర్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని TDP ఆరోపించింది.