News March 5, 2025

మహబూబాబాద్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,302 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 4,392, సెకండియర్‌లో 4,910 మంది విద్యార్థులు రాయనుండగా.. 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST

Similar News

News January 16, 2026

‘ఖమ్మం సభను విజయవంతం చేయండి’

image

పెద్దపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో CPI శత జయంతి ఉత్సవాల గోడపత్రికలను జిల్లా నాయకులు విడుదల చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు బాలసాని లెనిన్, ఆరెపల్లి మానస్, నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2026

సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

image

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.

News January 16, 2026

ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

image

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్‌లు కూడా. యాప్‌లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్‌గా ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు.