News March 5, 2025
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అల్లూరి జేసీ ఆరా..!

తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై జేసీ, ఇన్ ఛార్జ్ ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జే అభిషేక్ గౌడ ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రూమ్, వంట గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం మంచి ఆహారం అందించాలని ఆదేశించారు.
Similar News
News March 13, 2026
చిత్తూరు జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం ఇదే!

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్వెల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని DEO హెచ్చరించారు.
News March 13, 2026
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చండీగఢ్కు చెందిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి హాలులో ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 24న CJ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా చరిత్రకెక్కనున్నారు.
News March 13, 2026
42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.


