News March 5, 2025

జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News March 6, 2025

బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నైరాశ్యం!

image

KNR-ADB-NZB-MDK జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలను కైవసం చేసుకుని BJP జోష్‌లో ఉంది. రాష్ట్ర నేతలు సమష్టి కృషితో అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయి INC నైరాశ్యంలో పడిపోయిందని సమాచారం. అక్కడ ఏడుగురు మంత్రులు, 23 మంది MLAలు ఉన్నా అంతర్గత కలహాలు కొంపముంచాయని తెలుస్తోంది.

News March 6, 2025

తెనాలి: వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి 

image

తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్‌ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

News March 6, 2025

HYD: మార్చి 8న వాటర్ బంద్

image

BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌‌లో అంతరాయం ఉంటుందన్నారు.

error: Content is protected !!