News March 22, 2024
ఎవరు ఎలాంటి వారో నేడు అర్థమైంది: శ్రీదేవి

AP: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది’ అని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్, ట్యాగ్ని జత చేసి పక్కన కత్తి సింబల్ ఉంచారు. కాగా ఈ సీటును మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్కు టీడీపీ కేటాయించింది.
Similar News
News July 9, 2025
ఆమెకు ఐఫోన్, రూ.లక్షల్లో డబ్బు ఇచ్చా: యశ్

తనపై ఆరోపణలు చేస్తున్న యువతికి ఐఫోన్, రూ.లక్షల్లో నగదు అప్పుగా ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఆమె తిరిగి ఇవ్వలేదని RCB బౌలర్ <<16985182>>యశ్ దయాల్ <<>>తెలిపారు. తన కుటుంబసభ్యుల చికిత్స పేరుతోపాటు, షాపింగ్కు కూడా తీసుకెళ్లి డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటికీ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. పెళ్లి పేరుతో తనను వాడుకుని వదిలేశాడని యశ్పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News July 9, 2025
గుర్తుపట్టలేని లుక్లో స్టార్ హీరో

కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ నటిస్తున్న కొత్త మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తాజాగా ఈ సినిమాలో శివరాజ్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని సీరియస్గా చూస్తున్న ఫొటోలో ఆయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైశాక్ నిర్మిస్తున్నారు.
News July 9, 2025
బాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ‘కేజీ మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం. మా ప్రభుత్వ హయాంలో రూ.22-29కి కొన్నాం. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో బాబు గాడిదలు కాస్తున్నారా? మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు’ అని బంగారుపాళ్యం పర్యటనలో ఫైరయ్యారు.