News March 5, 2025
కవిటి : పెళ్లి ఫిక్స్.. యువతి సూసైడ్

నిశ్చితార్థమై పెళ్లి జరగాల్సిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కవిటి (M) కపాసుకుద్దిలో మంగళవారం జరిగింది. ఎస్సై వి. రవివర్మ కథనం.. వడ్డిపుట్టుగకు చెందిన సోనియాకు ఇటీవల నిశ్చితార్థమైంది. కాగా ఆమె పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 6, 2026
SKLM: 11 మంది పిల్లలపై పిచ్చి కుక్క దాడి

పొందూరులో పిచ్చికుక్క రెండు రోజుల్లో వీరంగం సృష్టించింది. మండల కేంద్రంలోని నాయుడువీధి, గాంధీనగర్, మార్కెట్ లైన్, కనకాల వీధిలలో 15 ఏళ్ల లోపు 11 మంది పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులను శ్రీకాకుళం RIMSకు తరలించారు. మిగతా వారికి పొందూరు సామాజిక హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.
News April 6, 2026
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం, మంగళవార లలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.
News April 6, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.


