News March 5, 2025
ఉప్పలగుప్తం : వాటర్ ట్యాంక్ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఉప్పలగుప్తానికి చెందిన విద్యార్థిని మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. ఆమె భీమవరంలో బీఫార్మసీ చదువుతోంది. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి మందలించాడని ఆత్మహత్యకు ప్రయత్నించింది. టౌన్ సీఐ వీరబాబు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. విద్యార్థిని కాపాడడంతో.. పెను ప్రమాదం తప్పింది.
Similar News
News March 15, 2026
తిరుపతి: హోటల్స్లో డొమెస్టిక్ వినియోగం..!

యుద్దం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. తిరుపతిలో చిన్నపాటి హోటల్స్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు డొమెస్టిక్ గ్యాస్ను అక్రమంగా వినియోగిస్తున్నారు. దీంతో డొమెస్టిక్ గ్యాస్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News March 15, 2026
నర్సంపేటలో యువ డాక్టర్ అనుమానస్పద మృతి

నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఆయన ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 15, 2026
HYD: ఓ వైపు ఉస్తాద్.. మరో వైపు ఇఫ్తార్.. ఫుల్ జోష్

ఈ సండే సిటీ అంతా సందడిగా మారనుంది. ఓవైపు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్తో అభిమానుల కోలాహలం, మరోవైపు LBస్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇఫ్తార్ విందు’తో వీఐపీల రాక, వీటికి తోడు రంజాన్ నెల చివరి ఆదివారం కావడంతో పాతబస్తీ నైట్ బజార్కు పోటెత్తనున్న జనం. ఇలా నగరం నలుమూలలా భారీ ఈవెంట్లతో హైదరాబాద్ నేడు ‘ఫుల్ జోష్’లో ఉండబోతోంది.


