News March 5, 2025

వనపర్తి జిల్లాలో వ్యక్తి మృతి

image

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. హీర్లతండాకు చెందిన హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందనట్లు వారు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 6, 2025

పెరుగుతున్న హనీట్రాప్ బాధితులు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హనీట్రాప్ బాధితులు పెరుగుతున్నారు. పరువుపోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ మెయిలింగ్‌తో డబ్బు వసూళ్లకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వీరేశానికి న్యూడ్ కాల్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News March 6, 2025

పెదపాడు: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై లైంగిక దాడి

image

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తె(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శారద సతీశ్ వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న మహిళ నాని అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన పెద్ద కుమార్తెపై ఇటీవల నాని లైంగిక దాడికి పాల్పడ్డాడన్న మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News March 6, 2025

నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

image

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్‌, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.

error: Content is protected !!