News March 5, 2025
కాజిపేట: MLA నాయిని WARNING

పథకాల అమలులో లీడర్ అయినా.. క్యాడర్ అయినా పైసల్ వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, పైసలు వసూలు చేసినా సహించేది లేదని అన్నారు.
Similar News
News March 27, 2026
వరంగల్: కాంగ్రెస్ పాత కమిటీల రద్దు

జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తెలిపారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సిటీలో డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత చేపడతామని పేర్కొన్నారు. కమిటీల్లో పదవుల కోసం నేతలు పోటీ పడనున్నారు. మండల అధ్యక్ష పదవులపై ఆయా ప్రాంతాల్లో పోటీ పెరగనుంది.
News March 27, 2026
వరంగల్: కాంగ్రెస్ పాత కమిటీల రద్దు

జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ తెలిపారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. సిటీలో డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత చేపడతామని పేర్కొన్నారు. కమిటీల్లో పదవుల కోసం నేతలు పోటీ పడనున్నారు. మండల అధ్యక్ష పదవులపై ఆయా ప్రాంతాల్లో పోటీ పెరగనుంది.
News March 25, 2026
WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.


