News March 22, 2024

కావలి: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

image

కావలి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున రైలు ఢీకొని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ అరుణ పోలీసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ రైలు ట్రాక్‌ను దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఉండొచ్చన్నారు. మహిళ వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతురాలి దేహంపై రోజ్ కలర్ చుడీదార్, వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ చున్నీ ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు. 

Similar News

News January 14, 2026

నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

image

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.