News March 5, 2025
అమ్రాబాద్: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామానికి చెందిన మేతరి హుస్సేన్ (39) జనవరి 14న అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా మల్లెల తీర్థం సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఈగలపెంట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.
Similar News
News March 10, 2026
తిరుపతి: పెరిగిన బుకింగ్స్… తగ్గిన సరఫరా

తిరుపతి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ అరకోరా సరఫరా అవుతుండగా.. డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్లు భారీగా పెరిగాయి. దీంతో గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ ఫోన్ నెంబర్ సైతం పని చేయడం లేదు. మరో వైపు బుకింగ్ అయిన వారికి 30 రోజుల పైగా డెలివరీ అయ్యే అవకాశం ఉందని ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. హోటల్ యాజమాన్యాల వినతి మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో JCతో బుధవారం డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగనుంది.
News March 10, 2026
HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.
News March 10, 2026
HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.


