News March 5, 2025
నిర్మల్: ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 6,571 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని డీఐఈఓ పరుశురాం తెలిపారు. వీరందరి కోసం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.
Similar News
News March 22, 2026
IPLలో అన్సోల్డ్.. కట్ చేస్తే 69 బంతుల్లో 195* రన్స్

అయోధ్య T20 ప్రీమియర్ లీగ్లో స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించారు. గోమతి థండర్ తరఫున ఆడిన ఆయన 69 బంతుల్లోనే 195* రన్స్ చేశారు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ప్లేయర్ ప్రియాంశు 54 బంతుల్లో సెంచరీ చేశారు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 307/0 స్కోర్ చేసింది. హిండన్ టైటాన్స్ 218 రన్స్కే ఆలౌటైంది. స్వస్తిక్ గతంలో DC, RCB టీమ్లలో ఉన్నా ఒక్క మ్యాచూ ఆడలేదు. 2026 వేలంలో అన్సోల్డ్గా మిగిలారు.
News March 22, 2026
రేషన్కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News March 22, 2026
మదనపల్లెలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మదనపల్లెలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం మదనపల్లె నూతన జిల్లా పోలీసు కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన నూతన కార్యాలయంలోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా మాట్లాడతారని తెలిపారు.


