News March 5, 2025

NGKL: ప్రధానోపాధ్యాయుడిపై పోక్స్ కేసు నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం తిరుపతయ్యపై పోక్సో కేసు నమోదైంది. పాఠశాలలో చదువుతున్న బాలికను హెచ్ఎం 20 రోజుల క్రితం లైంగికంగా వేధించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయగా హెచ్ఎంపై ఏఎస్‌పీ సీహెచ్ రామేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు షీటీం ఇన్‌ఛార్జ్ విజయలక్ష్మి తెలిపారు. ఘటనపై టీడీటీవో ఆదేశాల మేరకు ఏటీడీఓ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News July 5, 2025

పీఎం కిసాన్ పేరిట మోసాలు.. తాండూర్ డీఎస్పీ ALERT

image

పీఎం కిసాన్ యోజన పేరిట జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తాండూర్ DSP బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజలకు అవేర్నెస్ కల్పించే పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇదే చివరి అవకాశం అంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను నమ్మి వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దన్నారు. పథకానికి అప్లై చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్, అధికారులను మాత్రమే ఆశ్రయించాలన్నారు.

News July 5, 2025

GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

image

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.

News July 5, 2025

ఆ 11 మంది ఏమయ్యారు?

image

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.