News March 5, 2025

కోనసీమ : 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.

Similar News

News December 29, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్‌తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300

News December 29, 2025

నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

image

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.

News December 29, 2025

ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: టీటీడీ

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.