News March 5, 2025
గోపాల్ పేట: నీటి సంపులో పడి వ్యక్తి మృతి

నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు స్నానం చేసేందుకు సంపులో నుంచి నీళ్లు తీస్తుండగా నీటి సంపుపై ఉన్న బండ విరిగి సంపులో పడిపోయాడు. నీటి సంపులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృతి చెందాడు.
Similar News
News March 14, 2026
మెదక్: 11న పెళ్లి చూపులు.. యువతి MISSING

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ(22) ఇస్నాపూర్లో అదృశ్యమైంది. తన బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పటాన్చెరు పోలీసులు సురేఖ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News March 14, 2026
ట్రంప్.. వాటిని బూడిద చేస్తాం: IRGC

ఖర్గ్ ద్వీపంలోని (ఇరాన్) ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ <<19377504>>హెచ్చరికపై<<>> IRGC దీటుగా స్పందించింది. ‘ఉగ్రవాది ట్రంప్ ఇరాన్ ఆయిల్, ఎనర్జీ, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తామని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలా చేస్తే అమెరికా భాగస్వామ్యం ఉన్న అన్ని ఆయిల్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై అటాక్ చేస్తామని ఇదివరకే హెచ్చరించాం. వాటిని బూడిద చేసేస్తాం’ అని హెచ్చరించింది.
News March 14, 2026
గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.


