News March 5, 2025

WGL: శిరీష హత్య కేసులో కీలక మలుపు

image

HYD మలక్పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 25, 2026

పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

image

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

News March 25, 2026

పల్నాడు: ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

image

నియోజకవర్గాల పునర్విభజన అంశం పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం 7గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 11కి పెరిగే అవకాశం ఉండటంతో, రిజర్వేషన్ల మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎవరి సీటుకు ఎసర పెడతాయోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. తారుమారయ్యే మండలాలపై పట్టు సాధించడం ఇప్పుడు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది.

News March 25, 2026

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. 7000 మందితో BRSలోకి జీవన్‌రెడ్డి?

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌కు నేడు ఆయనతో పాటు సుమారు 7000 మంది అనుచరులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది MLAలను టార్గెట్‌గా చేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. వచ్చేనెల 5 నుంచి 10లోపు భారీ సభలో మాజీ CM KCR సమక్షంలో BRSలో చేరనున్నట్లు సమాచారం.