News March 5, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి గోవిందురాం పాల్గొన్నారు.
Similar News
News March 6, 2025
తగ్గిన బంగారం ధరలు!

రెండు రోజులుగా దాదాపు రూ.1360 పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గి సామాన్యుడికి ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది.
News March 6, 2025
NPS వాత్సల్య’తో పిల్లలకు మంచి భవిష్యత్తు: PFRDA ఛైర్పర్సన్

NPS వాత్సల్య పథకంలో ఇప్పటివరకూ లక్షమంది చేరినట్లు PFRDA ఛైర్పర్సన్ దీపక్ మహంతి వెల్లడించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే లక్షమంది చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులను ఇందులో చేర్చవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఇది మంచి స్కీం అని తెలిపారు. ఈ పథకాన్నికేంద్రం గతేడాది సెప్టెంబర్లో ప్రారంభించింది. 18సంవత్సరాల లోపు పిల్లలు ఇందులో చేరడానికి అర్హులు.
News March 6, 2025
ప్రియుడితో తమన్నా బ్రేకప్.. కారణమిదే?

హీరోయిన్ తమన్నా, విజయ్ శర్మ <<15649806>>విడిపోయారంటూ <<>>జరుగుతున్న ప్రచారానికి వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థలే కారణంగా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలనుకుంటుండగా విజయ్ నుంచి సానుకూలత రాలేదని సమాచారం. అలాగే ఆమె నియంత్రించే స్వభావం కారణంగా ఇరువురి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని టాక్. ఈ కారణాలతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.