News March 5, 2025

వనపర్తి: పరీక్ష రాసిన 6,476 మంది ఇంటర్ విద్యార్థులు

image

తొలిరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షకు 6,714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,476 మంది హాజరయ్యారు. 238 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన అధికారులు వనపర్తిలోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

Similar News

News March 6, 2025

రంగన్న మృతిపై భార్య అనుమానం.. పోలీసుల దర్యాప్తు

image

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

News March 6, 2025

‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

image

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

News March 6, 2025

‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

image

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!