News March 5, 2025

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.

Similar News

News August 22, 2025

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజ్

image

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి పర్యటించారు. ఆమె పర్యటనలను గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్ పాల్గొన్నారు.

News August 22, 2025

ఆదిలాబాద్‌లో గణేశ్ ఉత్సవాలకు డీజేలు నిషేధం

image

ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణపతి మండపాల వద్ద సౌండ్ బాక్సులు, మైక్ సెట్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి డీజేలను అద్దెకు తెచ్చి ఇచ్చేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

News August 21, 2025

‘జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అవసరం’

image

ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఏర్పడడం వలన జిల్లా ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకి వారికి కూడా ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.