News March 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
Similar News
News December 29, 2025
భూపాలపల్లి: ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో పారదర్శకత!

ఉపాధి హామీ పథకంలో నిధుల మంజూరును మరింత పకడ్బందీగా చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్పులు చేపట్టింది. పాత పద్ధతిని పక్కన పెట్టి, పీఎఫ్ఎంఎస్, ఎస్ఎన్ఏ స్పార్శ్ మాడ్యూల్ ద్వారా నిధులు విడుదల చేయనుంది. దీనివల్ల ట్రెజరీ నుంచి ఆమోదం పొందిన తర్వాతే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బిల్లులు జమ అవుతాయి. జిల్లాలోని 1,05,504 జాబ్ కార్డుదారులకు ఈ కొత్త విధానం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
News December 29, 2025
హనుమకొండ: ఒకే గ్రామం.. ఐదు చోట్ల పాలన!

జిల్లాలోని వెంకటేశ్వరపల్లి గ్రామస్థుల పరిస్థితి అత్యంత విచిత్రంగా మారింది. గ్రామం పేరు ఒకచోట ఉంటే, మండలం నడికూడ, రెవెన్యూ విభాగం నార్లాపూర్, తహశీల్దార్ కార్యాలయం కమలాపూర్, పోలీస్ స్టేషన్ పరకాలలో ఉన్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం ఒక మండలంలో దరఖాస్తు చేసి, మరో మండలంలో తీసుకోవాల్సి వస్తోంది. ఏ పత్రాల్లోనూ తమ ఊరి పేరు స్పష్టంగా ఉండటం లేదని, పాలనను క్రమబద్ధీకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News December 29, 2025
పాలమూరు: భవనం పైనుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని భావన(17).. రెండో అంతస్తు నుంచి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతికి కంటి చూపు సమస్య ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై సద్దాం పేర్కొన్నారు.


